Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ కరోనాతో అతలాకుతలం: సాయం చేసేందుకు సిద్ధమన్న చైనా

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (23:01 IST)
కరోనావైరస్ కారణంగా భారతదేశం అతలాకుతలం అవుతోందనీ, అక్కడ పరిస్థితులు దారుణంగా వున్నాయని, మందుల కొరత తలెత్తుతోందనీ, తాము అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా వున్నామని చైనా ప్రకటించింది.

మహమ్మారి కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోందనీ, ఈ క్లిష్ట సమయంలో పరస్పర సాయం చేసుకోవడం ఎంతో అవసరమని గురువారం నాడు మీడియాతో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు.
 
కరోనాను అదుపులోకి తెచ్చేందుకు భారతదేశానికి అవసరమైన అన్నిరకాల సాయం చేసేందుకు చైనా సిద్ధంగా వుందని తెలిపారు. కాగా దేశంలో కరోనా కేసులు రాకెట్ వేగంతో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,14,835 కరోనా కేసులు నమోదవగా 2,104 మంది మృతి చెందారు.

కరోనా వచ్చిన తర్వాత దేశంలో ఒకేరోజు ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు దేశంలో మొత్తం 1.59 కోట్లు కరోనా కేసులు నమోదవగా మరణించినవారి సంఖ్య 1,84,657కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments