Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచానికి భారత్ ఆశాకిరణం : ప్రశంసల వర్షం కురిపించిన బిల్ గేట్స్

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (11:31 IST)
భారతదేశంపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచానికి భారత్ ఒక ఆశాకిరణంలా నిలిచిందని ఆయన కొనియాడారు. పైగా, ఏకకాలంలో అనేక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని చేతల ద్వారా నిరూపించిందని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన గేట్స్ నోట్స్ పేరిట తన బ్లాగులో భారత్‌ను ప్రశంసిస్తూ కొన్ని వ్యాఖ్యలు రాశారు. 
 
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న భారీ సమస్యలను ఏకకాలంలో ఎదుర్కోవచ్చన్న నమ్మకం తనకుందని చెప్పారు. ఇందుకోసం సరైన ఆవిష్కరణలు, వాటి ఫలాలు ప్రజలకు అందేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుత సమస్యలను ఎదుర్కొనేందుకు కావాల్సిన డబ్బు, సమయం అందుబాటులో లేవని కొందరు తరచూ తనతో వ్యాఖ్యానిస్తుంటారని తెలిపారు. ఈ భవన తప్పని భారత్ రుజువు చేసిందన్నారు. 
 
"ఇది తప్పని చెప్పేందుకు భారత్‌కు మించిన నిదర్శనం మరొకటి లేదు. భారత్ ఇటీవలికాలంలో అద్భుతమైన ప్రగతి సాధించింది. ప్రపంచానికి ఆశాకిరణంగా నిలిచింది. భారీ సవాళ్ళను ఏకకాలంలో ఎదుర్కోవచ్చని నిరూపించింది. భారత్  పోలియో వ్యాధిని పారద్రోలింది. హెచ్.ఐ.వి. వ్యాప్తికి అడ్డుకట్ట వేసింది. పేదరికం, శిశుమరణాలను గణనీయంగా తగ్గించింది. పారిశుధ్యం, ఆర్థికసేవలను అధికశాతం మందికి అందుబాటులోకి తెచ్చింది" అని బిల్ గేట్స్ తన నోట్స్‌లో రాసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments