Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీచులాటలు వద్దు... శాంతి మంత్రం పఠిద్దాం.. భారత్‌కు చైనా వినితి!

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (13:20 IST)
చైనా దేశం శాంతిమంత్రం జరిపిస్తోంది. సరిహద్దుల్లో కీచులాటలు వద్దంటూ భారత్‌కు విజ్ఞప్తి చేసింది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద నెలకొన్న ఉద్రిక్తలు తగ్గించుకునేందుకు ఇండోచైనా సరిహద్దుల్లో సిద్ధమయ్యాయి. ఇందులోభాగంగా, ఇరు వైపులా మూడు దశల్లో బలగాల ఉపసంహరణకు ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చినట్టు ఎఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. 
 
నవంబరు 6న చుషుల్ పోస్టులో ఎనిమిదో విడత కోర్‌ కమాండర్ ‌స్థాయి చర్చల్లో ఈ మేరకు నిర్ణయించారు. తూర్పు లఢక్‌లో ఏప్రిల్‌మే సమయంలో ఇరు దేశాల సైన్యాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెనక్కి వెళ్లాలన్న షరతుకు ఇరు పక్షాలు కట్టుబడి ఉండాలన్న ఒప్పందం అధికారికంగా కుదరాల్సి ఉన్నది. పాంగాంగ్ సరస్సు వద్ద తుది దఫా చర్చలు జరిపి ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. 
 
వారం రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తయ్యెలా చర్యలు చేపట్టేందుకు కూడా ఇరుపక్షాలు అంగీకరించినట్టు చెబుతున్నారు. అందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేయనున్నారు. నవంబరు 6న జరిగిన చర్చల్లో విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ నవీన్ శ్రీవాత్సవ కూడా పాల్గొన్నారు. 
 
సూత్రప్రాయంగా అంగీకరించిన మేరకు ఉపసంహరణ ప్రక్రియ మొదటి దశలో ఒక్క రోజులోనే ట్యాంకులుసహా సాయుధ వాహనాలను ఎల్‌ఎసికి దూరంగా తరలించాలి. రెండో దశలో సరస్సు ఉత్తర తీరంలో రోజుకు 30 శాతం బలగాల చొప్పున మూడు రోజులపాటు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments