Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తర సిరియాలో ఉగ్ర బీభత్సం.. కారును పేల్చేశారు.. 14మంది మృతి

ఉత్తర సిరియాలో ఉగ్ర బీభత్సం.. కారును పేల్చేశారు.. 14మంది మృతి
, బుధవారం, 7 అక్టోబరు 2020 (13:18 IST)
Blast
ప్రపంచ దేశాలు కరోనాతో నానా తంటాలు పడుతుంటే.. ఉగ్రవాదులు మరోవైపు పెచ్చరిల్లిపోతున్నారు. ఉత్తర సిరియాలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో 14 మంది మృతిచెందారు. 80 మంది గాయపడ్డారు. అలెప్పొ ప్రావిన్సులో ఉన్న అల్ బాబ్ జిల్లా పట్టణంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడు పదార్థాలు ఉన్న ట్రక్కును ఉగ్రవాదులు పేల్చారు. ఈ దాడి వెనుక ఐపీజీ లేదా పీకేకే ఉగ్రవాద గ్రూపు ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. 
 
అల్ బాబ్ పట్టణంలో దాడి జరగడం వారంలోనే ఇది రెండవసారి. ఆదివారం చెక్ పాయింట్ వద్ద జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ చెర నుంచి అల్ బాబ్ పట్టణాన్ని 2017లో సిరియా ఆర్మీ విముక్తి చేసింది. టర్కీ బోర్డర్ సమీపంలో ఉన్న ఈ పట్టణం నుంచి ఉగ్రవాదులను ఎరివేసేందుకు 2016లో ఏడు నెలల ఆపరేషన్ చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భార్య నాపై కేసు పెట్టింది.. ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది.. రండి సార్ చూపిస్తా..?