Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతనావస్థకు పాకిస్థాన్ ఆర్థిక రంగం : పాక్ ప్రధాని ఇమ్రాన్

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (10:48 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, తమ దేశ ఆర్థిక పరిస్థితిని బహిర్గతం చేశారు. దేశాన్ని నడిపేందుకు తమ వద్ద నిధులు లేవంటూ ప్రకటించి బాంబు పేల్చారు. దీంతో ప్రజా సంక్షేమ పథకాలపై పెద్ద మొత్తంలో నిధుల్ని ఖర్చు చేయలేమని తెగేసి చెప్పారు. 
 
దేశ ఆర్థిక రంగం పతనావస్థకు చేరుకోవడానికి విదేశీ అప్పులు పెరిగిపోవడం, దేశీయంగా పన్ను వసూళ్లు గణనీయంగా తగ్గిపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయన్నారు. దీంతో దేశ రక్షణ రంగానికి కూడా తగినన్ని నిధులను కేటాయించలేని పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి మరోమారు విదేశీ రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. 
 
ముఖ్యంగా, గత నాలుగు నెలల్లో ప్రభుత్వం ఏకంగా 3.8 బిలియన్ డాలర్ల మేరకు అప్పులు చేసిందని గుర్తుచేశారు. ఈ అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే ప్రజలు భారీ ఎత్తున పన్నులు చెల్లించాలని ఇస్లామాబాద్ నగరంలో బ్యూరో ఆఫ్ రెవెన్యూ విభాగంలో ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments