పతనావస్థకు పాకిస్థాన్ ఆర్థిక రంగం : పాక్ ప్రధాని ఇమ్రాన్

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (10:48 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, తమ దేశ ఆర్థిక పరిస్థితిని బహిర్గతం చేశారు. దేశాన్ని నడిపేందుకు తమ వద్ద నిధులు లేవంటూ ప్రకటించి బాంబు పేల్చారు. దీంతో ప్రజా సంక్షేమ పథకాలపై పెద్ద మొత్తంలో నిధుల్ని ఖర్చు చేయలేమని తెగేసి చెప్పారు. 
 
దేశ ఆర్థిక రంగం పతనావస్థకు చేరుకోవడానికి విదేశీ అప్పులు పెరిగిపోవడం, దేశీయంగా పన్ను వసూళ్లు గణనీయంగా తగ్గిపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయన్నారు. దీంతో దేశ రక్షణ రంగానికి కూడా తగినన్ని నిధులను కేటాయించలేని పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి మరోమారు విదేశీ రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. 
 
ముఖ్యంగా, గత నాలుగు నెలల్లో ప్రభుత్వం ఏకంగా 3.8 బిలియన్ డాలర్ల మేరకు అప్పులు చేసిందని గుర్తుచేశారు. ఈ అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే ప్రజలు భారీ ఎత్తున పన్నులు చెల్లించాలని ఇస్లామాబాద్ నగరంలో బ్యూరో ఆఫ్ రెవెన్యూ విభాగంలో ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments