Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ డ్రగ్స్ మాఫియా.. గుజరాత్‌లోని మోర్బీలో భారీ స్థాయిలో డ్రగ్స్

Advertiesment
పాకిస్థాన్ డ్రగ్స్ మాఫియా.. గుజరాత్‌లోని మోర్బీలో భారీ స్థాయిలో డ్రగ్స్
, సోమవారం, 15 నవంబరు 2021 (12:11 IST)
పాకిస్థాన్ డ్రగ్స్ మాఫియాను పోలీసులు గుర్తించారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో భారీస్థాయిలో డ్రగ్స్‌ పట్టుకున్నారు ఏటీఎస్ అధికారులు. మలియా మియానా నుంచి 120 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ మార్కెట్ ధర రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ ముఠాకు చెందిన నలుగురుని కూడా అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
 
ఇది ఖలీద్ బక్ష్‌కు సంబంధించిన డ్రగ్స్‌గా గుర్తించారు పోలీసులు. ఈ డ్రగ్స్ పాకిస్థాన్ నుండే భారత్‌కు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో బయటకు వస్తున్న ఖలీద్ అనే వ్యక్తికి నేరుగా ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో పరిచయం ఉన్నట్లుగా తెలుస్తుంది. భారత్‌కు పంపిన ఈ డ్రగ్స్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను దుబాయ్‌లో రచించినట్లు సమాచారం.
 
దుబాయ్‌లోని సోమాలియా క్యాంటీన్‌లో పాకిస్థాన్ మాఫియా ఖలీద్ ఇద్దరు భారతీయ స్మగ్లర్లు జబ్బార్, గులామ్‌లను కలిశాడు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. పాకిస్థానీ డ్రగ్స్ మాఫియా ఖలీద్ భారత్‌కు భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఇంతకుముందు కూడా అనేకసార్లు ప్రయత్నించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

60 యేళ్ల తర్వాత తొలిసారి పంచాయతీ పోల్ జరిగిన గ్రామం!