Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో మారణహోమం - 12 మందిని కాల్చిచంపిన దుండగులు

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (10:06 IST)
నైజీరియా దేశంలో మరో మారణహోమం జరిగింది. ఒక మసీదులో చొరబడిన సాయుధ దుండగులు మసీదు ఇమామ్‌తో సహా 12 మందిని తుపాకీతో కాల్చి చంపేశారు. ఆ తర్వాత మరికొందరిని బందీలుగా తమ వెంట తీసుకెళ్లారు. 
 
గత కొంతకాలంగా నైజీరియాలో బందిపోట్లుగా పిలిచే సాయుధ ముఠాలు ప్రజలపై దాడి చేసి హత్య చేయడమో లేక కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడమో పరిపాటిగా మారిపోయింది. అలాగే, రైతులు పంటలు పండించుకోవాలన్నా ఈ ముఠాలకు ప్రొటెక్షన్ ఫీ పేరుతో కప్పం చెల్లించుకోవాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా సాయుధ దండగులు మరోమారు పెట్రేగిపోయారు. ఏకంగా 12 మందిని కాల్చిచంపి మారణహోమానికి పాల్పడ్డారు. ఈ దారుణం నైజీరియా అధ్యక్షుడు ముహమ్ముదు బుహారీ సొంత రాష్ట్రమైన కట్సినాలో జరిగింది. మైగమ్‌జీ మసీదు వద్ద మోటారు సైకిళ్లపై వచ్చిన దండగులు ఒక్కసారిగా లోపల ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపారు. 
 
దీంతో మసీదులో ఉన్న వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రాణభయంతో పరుగులు చేశారు. ఈ క్రమంలో మసీదు ఇమామ్‌తో సహా 12 మందిని కాల్చిచంపేశారు. ఆ తర్వాత మరికొందరిని కిడ్నాప్ చేశారు. బందిపోట్ల ముఠా శిబిరాలపై నైజీరియా సైన్యం దాడులు చేస్తున్నప్పటికీ ఇలాంటి మారణహోమాలు మాత్రం ఆగడంలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments