Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుందర్ పిచాయ్‌కి పద్మభూషణ్.. భారత్ నా శరీరంలో అంతర్భాగం

Sundar pichai
, శనివారం, 3 డిశెంబరు 2022 (14:01 IST)
Sundar pichai
భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్‌కు ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు లభించింది. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబారి నుంచి సుందర్ పిచాయ్ శుక్రవారం ఈ పురస్కారం అందుకున్నారు. 
 
2022 ఏడాదికి గానూ సుందర్ పిచాయ్‌కి పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించగా, అమెరికాలోని భారత రాయబారి నుంచి సుందర్ పిచాయ్ శుక్రవారం ఈ పురస్కారం అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. భారతదేశం తన శరీరంలో అంతర్భాగమన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తన వెంట భారతదేశాన్ని తీసుకెళ్తానని చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 
 
ఈ సందర్భంగా భారత సర్కారుకు, దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేగాకుండా తన తల్లిదండ్రులకు, తన ఎదుగుదలకు సాయపడిన వారిని గుర్తు చేసుకున్నారు.  
 
కాగా మదురై నుండి మౌంటెన్ వ్యూ వరకు సుందర్ పిచాయ్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, భారతదేశం-అమెరికా ఆర్థిక- సాంకేతికతను బలోపేతం చేసిందని.. విదేశాంగ శాఖ అధికారి తరంజిత్ ఎస్ సంధు అన్నారు. సుందర్ పిచాయ్‌కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగల దుకాణంలోకి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు