Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ జీ.. ప్లీజ్... ఒకే ఒక్క ఛాన్సివ్వండి.. ప్రాధేయపడుతున్న ఇమ్రాన్

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (12:50 IST)
పుల్వామా ఉగ్రదాడి తర్వాత్ పాకిస్థాన్‌పై భారత్ ఏ క్షణమైనా దాడి చేసేందు సిద్ధంగా ఉంది. దీంతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోతోంది. ఒకవేళ భారత్ దాడి చేస్తే దాన్ని తిప్పికొట్టేందుకు వీలుగా యుద్ధ ట్యాంకులను సరిహద్దుల వెంబడకు తరలిస్తోంది. అలాగే సైన్యాన్ని కూడా భారీ సంఖ్యలో సరిహద్దులకు తరలిస్తోంది. 
 
ఇదిలావుంటే, పూల్వామా దాడికి సరైన ఆధారాలు చూపాలంటూ మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు గొంతు సవరించుకున్నారు. మీరు నిజంగా పఠాన్ బిడ్డైతే... ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న మోడీ విసిరిన సవాల్‌కు స్పందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ఇమ్రాన్ చెప్పారు. 
 
అయితే దీనికి సంబంధించి పాక్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో భారత్ ఉగ్రదాడికి సంబంధంచి సరైన ఆధారలు అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీంతో పాటు శాంతికి కూడ భారత్ ఓ అవకాశం ఇవ్వాలని ఇమ్రాన్ అందులో కోరారు.
 
పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఎన్నికైన సందర్భంగా మోడీ పేదరికం, నిరక్షరాస్యతపై కలిసి పోరాడుదామంటూ ఇమ్రాన్‌కు పిలుపునిచ్చారు. దీనికి ఇమ్రాన్‌ స్పందిస్తూ.. తాను పఠాన్‌ వంశస్థుడినని, ఇచ్చిన మాట తప్పమని బదులిచ్చారు. ఆ సందేశాన్ని ఇప్పుడు ఉటంకిస్తూ పఠాన్‌ బిడ్డవైతే చర్యలు తీసుకోవాలంటూ మోడీ సవాల్‌ విసిరారు. 
 
అయితే పుల్వామా దాడి వెనక పాకిస్థాన్‌ హస్తం ఉందన్న భారత్‌ వాదనను ఇమ్రాన్‌ఖాన్‌ గతంలో తోసిపుచ్చారు. ఆధారాలుంటే చూపాలని సవాల్‌ విసిరారు. ఇంతలోనే దాడికి పాల్పడిన జైష్ ఇ మొహమ్మద్ ఈ దాడికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టింది. దీంతో ఏం చేయాలో తెలియని పాకిస్థాన్.. ఇపుడు మోడీ శరణు వేడుతోంది. ప్లీజ్.. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments