Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీరు పెట్టిన జర్మనీ... అశ్రునయనాలతో నివాళి... ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (09:08 IST)
జర్మనీ కన్నీరుపెడుతోంది. ఓ తల్లి చేసిన ఘోరానికి ఆ దేశ ప్రజలంతా బోరున విలపిస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురిని ఆ తల్లి అత్యంత పాశవికంగా చంపేసింది. ఈ ముక్కుపచ్చలారని చిన్నారుల హత్య విషయం తెలుసుకుని జర్మనీవాసులు కన్నీరుపెడుతున్నారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జర్మనీలోని సోలింగెన్‌ నగరంలో 27 యేళ్ళ మహిళకు మెలీనా, లియోనీ, సోఫీ, టిమో, లుకా అనే ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరి వయసు 1 నుంచి 8 యేళ్ళ వరకు ఉంటాయి. ఈ ఐదుగురు బిడ్డలను గురువారం దారుణంగా హత్యచేసింది. ఆ తర్వాత తాను కూడా రైలు కింద దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, ఆమె తృటిలో ప్రాణాలు తీసుకుంది. 
 
కన్నబిడ్డలను అత్యంత పాశవికంగా హత్య చేసిన విషయం తెలుసుకున్న స్థానికులతోపాటు దేశప్రజలంతా చలించిపోయారు. ఘటనా స్థలంలో శనివారం కొవ్వొత్తులు వెలిగించి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. 
 
ఈ చిన్నారులను హత్యచేయటానికి ముందు మహిళ తన 11 ఏండ్ల పెద్ద కుమారుడిని అమ్మమ్మ ఇంటికి పంపటంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ హత్యలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గాయాలతో బయటపడిన సదరు మహిళకు దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments