Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీరు పెట్టిన జర్మనీ... అశ్రునయనాలతో నివాళి... ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (09:08 IST)
జర్మనీ కన్నీరుపెడుతోంది. ఓ తల్లి చేసిన ఘోరానికి ఆ దేశ ప్రజలంతా బోరున విలపిస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురిని ఆ తల్లి అత్యంత పాశవికంగా చంపేసింది. ఈ ముక్కుపచ్చలారని చిన్నారుల హత్య విషయం తెలుసుకుని జర్మనీవాసులు కన్నీరుపెడుతున్నారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జర్మనీలోని సోలింగెన్‌ నగరంలో 27 యేళ్ళ మహిళకు మెలీనా, లియోనీ, సోఫీ, టిమో, లుకా అనే ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరి వయసు 1 నుంచి 8 యేళ్ళ వరకు ఉంటాయి. ఈ ఐదుగురు బిడ్డలను గురువారం దారుణంగా హత్యచేసింది. ఆ తర్వాత తాను కూడా రైలు కింద దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే, ఆమె తృటిలో ప్రాణాలు తీసుకుంది. 
 
కన్నబిడ్డలను అత్యంత పాశవికంగా హత్య చేసిన విషయం తెలుసుకున్న స్థానికులతోపాటు దేశప్రజలంతా చలించిపోయారు. ఘటనా స్థలంలో శనివారం కొవ్వొత్తులు వెలిగించి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. 
 
ఈ చిన్నారులను హత్యచేయటానికి ముందు మహిళ తన 11 ఏండ్ల పెద్ద కుమారుడిని అమ్మమ్మ ఇంటికి పంపటంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ హత్యలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గాయాలతో బయటపడిన సదరు మహిళకు దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments