Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్‌పై మత్తు చల్లి... మైనర్ బాలికపై బలాత్కారం... ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (08:52 IST)
అభంశుభం తెలియని మైనర్లు కూడా కామాంధుల కంబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు. ఈ కామాంధులు ఆటలు కట్టించేందుకు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితంగా మాత్రం శూన్యంగానే ఉంది. తాజాగా ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. అదీకూడా.. కరోనా వైరస్ సోకకుండా ముఖానికి ధరించే మాస్కుపై మత్తు చల్లి... ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రానికి చెందిన ఓ లేబర్ కాంట్రాక్టర్... తన వద్ద పని చేసే ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. అందుకే.. ఆమెకు ఓ కొత్త మాస్క్ కొనిచ్చాడు. ఈ ఫేస్‌మాస్కుపై మత్తు చల్లి, దాన్ని ఆమెకిచ్చాడతను. విషయం తెలియని మైనర్ బాలిక.. ఆ మాస్కు వేసుకుంది. 
 
ఆ తర్వాత స్పృహతప్పింది. ఆ సమయంలో సదరు కాంట్రాక్టర్ ఆమెను బలాత్కరించాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడట. ఈ విషయం చెప్పి బాధితురాలు భోరుమంది. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments