మాస్క్‌పై మత్తు చల్లి... మైనర్ బాలికపై బలాత్కారం... ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (08:52 IST)
అభంశుభం తెలియని మైనర్లు కూడా కామాంధుల కంబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు. ఈ కామాంధులు ఆటలు కట్టించేందుకు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితంగా మాత్రం శూన్యంగానే ఉంది. తాజాగా ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. అదీకూడా.. కరోనా వైరస్ సోకకుండా ముఖానికి ధరించే మాస్కుపై మత్తు చల్లి... ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రానికి చెందిన ఓ లేబర్ కాంట్రాక్టర్... తన వద్ద పని చేసే ఓ మైనర్ బాలికపై కన్నేశాడు. అందుకే.. ఆమెకు ఓ కొత్త మాస్క్ కొనిచ్చాడు. ఈ ఫేస్‌మాస్కుపై మత్తు చల్లి, దాన్ని ఆమెకిచ్చాడతను. విషయం తెలియని మైనర్ బాలిక.. ఆ మాస్కు వేసుకుంది. 
 
ఆ తర్వాత స్పృహతప్పింది. ఆ సమయంలో సదరు కాంట్రాక్టర్ ఆమెను బలాత్కరించాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడట. ఈ విషయం చెప్పి బాధితురాలు భోరుమంది. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments