Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ మద్దతుదారులతో అమెరికాలో హింస.. నలుగురు మృతి

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (12:48 IST)
అమెరికా క్యాపిటల్ హిల్ బిల్డింగ్‌లో జరిగిన హింసలో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలో అధికారులు 52 మందిని అరెస్టు చేశారు. బైడెన్ విజయాన్ని ఖారారు చేసేందుకు జరుగుతున్న సమావేశాలను అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అభిమానులంతా క్యాపిటల్ హిల్‌ను అటాక్ చేశారు. ఆ సమయంలో జరిగిన హింసలో క్యాపిటల్ గ్రౌండ్‌లోనే సుమారు 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. 
 
లైసెన్సు లేని .. నిషేధిత ఆయుధాలు కలిగి ఉన్న వారిని కూడా అరెస్టు చేశారు. రిపబ్లికన్‌, డెమోక్రటిక్ నేషనల్ కమిటీ హెడ్‌క్వార్టర్ల వద్ద రెండు పైప్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. క్యాపిటల్ పోలీసు ఆఫీసర్ జరిపిన ఫైరింగ్‌లో ఓ మహిళ మృతిచెందింది. 
 
మరో ముగ్గురు మెడికల్ ఎమర్జెన్సీ కారణాల వల్ల మృతిచెందారు. క్యాపిటల్ అటాక్ ఘటనలో మొత్తం 14 మంది పోలీసులు గాయపడ్డారు. ఇద్దరు పోలీసులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. క్యాపిటల్ హిల్ ఘటనలో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments