Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో భారీ భూకంపం: 69 మంది మృతి, పలువురికి గాయాలు

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (09:12 IST)
నేపాల్‌లో భారీ భూకంపం ఏర్పడింది. శుక్రవారం అర్ధరాత్రి పశ్చిమ నేపాల్‌లో 5.6-తీవ్రతతో కూడిన భూకంపం సంభవించడంతో దాదాపు 69 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు అధికారులు తెలిపారు.
 
పశ్చిమ జాజర్‌కోట్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2:02 గంటలకు ఈ భూకంపం ఏర్పడింది. 18 కి.మీ లోతుతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వేను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. 
 
భూకంపం కారణంగా రుకుమ్ జిల్లాలో 35 మంది, పొరుగున ఉన్న జాజర్‌కోట్ జిల్లాలో 34 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. 
 
తక్షణమే రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్‌లకు ఆదేశించారు. కాగా 2015లో ఇదే తరహా భూకంపం ఏర్పడింది. 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 9,000 మంది మరణించారు. పర్వత దేశంలోని అర మిలియన్లకు పైగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments