కృత్రిమ వర్షంతో ఎండ నుంచి ఉపశమనం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 22 జులై 2021 (16:09 IST)
గతంలో మ‌న తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రువు స‌మ‌యంలో రాయలసీమ ప్రాంతాల్లో మేఘమథనం (కృత్రిమ వర్షం) చేపట్టారు. క్లౌడ్ సీడింగ్ చేయడం వల్ల కృత్రిమ వ‌ర్షాలు కురిపించే ప్ర‌య‌త్నం చేశారు. 
 
కానీ ఎడారి దేశ‌మైనా వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఎప్పుడూ ముందుండే యూఏఈ ఓ కొత్త టెక్నాల‌జీని ఉప‌యోగించి కృత్రిమ వ‌ర్షం కురిపించింది. దేశంలో ఎండ‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌ను కూడా తాకుతున్నాయి. దీంతో ఎండ వేడిమి నుంచి ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు దుబాయ్ ఓ వినూత్న ప్ర‌య‌త్నం చేసింది.
 
ఈ కొత్త టెక్నాల‌జీలో భాగంగా డ్రోన్ల సాయంతో మేఘాల‌కు షాకిచ్చి కృత్రిమ వ‌ర్షం కురిపించింది. దుబాయ్‌లోని ఓ హైవేపై ఇలా వ‌ర్షం కురుస్తున్న వీడియో వైర‌ల్‌గా మారింది. కొన్నేళ్లుగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపించి క్లౌడ్ సీడింగ్ ద్వారానే యూఏఈ కృత్రిమ వ‌ర్షాలు కురిపిస్తోంది. 
 
ఈ డ్రోన్లు మేఘాల్లోకి విద్యుత్తును పంపిస్తాయి. అది కాస్తా మేఘాల్లో ఎల‌క్ట్రిక‌ల్ బ్యాలెన్స్‌ను మార్చి వ‌ర్షం కురిపిస్తాయి. మేఘాల్లోని వ‌ర్ష బిందువుల‌ను చార్జ్ చేయ‌డానికి తాము ఇలా డ్రోన్ల‌ను పంపిస్తున్న‌ట్లు ఈ ప్రాజెక్ట్‌పై ప‌ని చేసిన శాస్త్రవేత్త డాక్ట‌ర్ కెరి నికోల్ చెప్పారు. ఈ కొత్త టెక్నాల‌జీ యూఏఈలో వ‌ర్ష‌పాతాన్ని పెంచుతుంద‌ని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments