Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్‌లో వెలుగు చూసిన 3400 యేళ్ల నాటి పురాతన నగరం

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (16:35 IST)
ఇరాక్ దేశంలో 3400 యేళ్ల నాటి పురాతన నగరం ఒకటి వెలుగుచూసింది. ఈ దేశంలోని కుర్దిస్థాన్‌లో కరవు కారణంగా ఇక్కడి భారీ జలాశయం ఒకటి ఎండిపోయింది. ఈ క్రమంలో దాదాపు 3,400 ఏళ్లనాటి పురాతన నగరం తాజాగా బయటపడింది. 
 
టైగ్రిస్‌ నది ఎండిపోయిన భాగంలో కనిపించిన ఈ స్థావరాన్ని.. కాంస్య యుగానికి చెందినదిగా భావిస్తున్నారు. నదిలో నీళ్లు లేకపోవడంతో.. ఇక్కడ తవ్వకాలకు వీలు కుదిరింది. క్రీ.పూ 1550 - క్రీ.పూ 1350 మధ్య మిట్టని సామ్రాజ్య పాలనలో ఈ నగరం.. కీలక కేంద్రంగా విలసిల్లి ఉండొచ్చని కుర్దిష్‌, జర్మనీ ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది.
 
జర్మనీ పురావస్తు బృందంలోని డా.ఇవాన పుల్జిజ్‌ ఓ ప్రకటనలో స్పందిస్తూ, 'ఈ నగరం నేరుగా టైగ్రిస్‌లో బయటపడింది. అంటే.. అప్పట్లో ఇది మిట్టని సామ్రాజ్యంలోని ప్రధాన ప్రాంతాన్ని(ప్రస్తుతం ఈశాన్య సిరియాలో ఉంది).. దాని తూర్పు ప్రాంతంతో అనుసంధానించడంలో ముఖ్యమైన పాత్ర పోషించి ఉండవచ్చు' అని పేర్కొన్నారు. 
 
అయితే, ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. దీంతో పురాతన నగరం మరింత దెబ్బతినకుండా ఉండేందుకుగానూ దాన్ని పూర్తిగా ప్లాస్టిక్‌ షీట్‌లతో కప్పారు. మట్టి గోడలను, శిథిలాల్లో దాగి ఉన్న ఇతర వస్తువులను సంరక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments