Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్‌లో వెలుగు చూసిన 3400 యేళ్ల నాటి పురాతన నగరం

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (16:35 IST)
ఇరాక్ దేశంలో 3400 యేళ్ల నాటి పురాతన నగరం ఒకటి వెలుగుచూసింది. ఈ దేశంలోని కుర్దిస్థాన్‌లో కరవు కారణంగా ఇక్కడి భారీ జలాశయం ఒకటి ఎండిపోయింది. ఈ క్రమంలో దాదాపు 3,400 ఏళ్లనాటి పురాతన నగరం తాజాగా బయటపడింది. 
 
టైగ్రిస్‌ నది ఎండిపోయిన భాగంలో కనిపించిన ఈ స్థావరాన్ని.. కాంస్య యుగానికి చెందినదిగా భావిస్తున్నారు. నదిలో నీళ్లు లేకపోవడంతో.. ఇక్కడ తవ్వకాలకు వీలు కుదిరింది. క్రీ.పూ 1550 - క్రీ.పూ 1350 మధ్య మిట్టని సామ్రాజ్య పాలనలో ఈ నగరం.. కీలక కేంద్రంగా విలసిల్లి ఉండొచ్చని కుర్దిష్‌, జర్మనీ ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది.
 
జర్మనీ పురావస్తు బృందంలోని డా.ఇవాన పుల్జిజ్‌ ఓ ప్రకటనలో స్పందిస్తూ, 'ఈ నగరం నేరుగా టైగ్రిస్‌లో బయటపడింది. అంటే.. అప్పట్లో ఇది మిట్టని సామ్రాజ్యంలోని ప్రధాన ప్రాంతాన్ని(ప్రస్తుతం ఈశాన్య సిరియాలో ఉంది).. దాని తూర్పు ప్రాంతంతో అనుసంధానించడంలో ముఖ్యమైన పాత్ర పోషించి ఉండవచ్చు' అని పేర్కొన్నారు. 
 
అయితే, ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. దీంతో పురాతన నగరం మరింత దెబ్బతినకుండా ఉండేందుకుగానూ దాన్ని పూర్తిగా ప్లాస్టిక్‌ షీట్‌లతో కప్పారు. మట్టి గోడలను, శిథిలాల్లో దాగి ఉన్న ఇతర వస్తువులను సంరక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments