Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్.. 300 మంది మహిళా ఉద్యోగులకు అస్వస్థత

Fire
, శుక్రవారం, 3 జూన్ 2022 (17:37 IST)
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో పోరస్ కంపెనీ నుంచి విషవాయువు లీకైంది. ఈ  వాయువు ఘాటుగా ఉండడంతో స్పృహ కోల్పోయారు. 
 
దాదాపు 300 మంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురికాగా, వారిలో 80 మందిని అత్యవసర వైద్య చికిత్స కోసం అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 200 మందిని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. 
 
దీనిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. గ్యాస్ లీకేజి ఘటనలో ప్రాణనష్టం లేదని వెల్లడించారు. అయితే పెద్ద సంఖ్యలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. కార్మికులకు వైద్య చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. 
 
సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలానికి వెళ్లారని మంత్రి వివరించారు. ప్రమాదానికి కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. కాగా, కంపెనీ నుంచి లీకైన వాయువును అమ్మోనియా గ్యాస్ గా భావిస్తున్నారు.
 
విశాఖ సమీపంలోని అచ్యుతాపురం ఎస్ఈజడ్ లో గ్యాస్ లీక్ కావడంపై సీఎం జగన్ స్పందించారు. ఈ ఘటనపై ఆరా తీశారు. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలంటూ స్థానిక మంత్రిని ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

eSanjeevani పథకం గురించి తెలుసా? ఏబీడీఎంతో లింక్ అయిన ఇ-సంజీవని