స్నేహ బంధానికి 'డోక్లాం' ఎసరు.. భారత్‌కు చైనా వార్నింగ్

భారత్, చైనా దేశాల మధ్య డోక్లాం వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. ఈ వివాదం కారణంగా ఉభయ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత చైనా వెనక్కి తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (09:50 IST)
భారత్, చైనా దేశాల మధ్య డోక్లాం వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. ఈ వివాదం కారణంగా ఉభయ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత చైనా వెనక్కి తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇపుడు మరోమారు చైనా ఈ అంశాన్ని లేవనెత్తుతూ, భారత్‌కు వార్నింగ్ ఇచ్చింది. దీనిపై భారత్ కూడా ఒకింత ఘాటుగానే స్పందించింది. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు వద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించింది. 
 
భారత్, పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో డోక్లాం ఉంది. ఈ ప్రాంతం మీదుగా పాకిస్థాన్ వరకు చైనా ఓ రోడ్డు నిర్మాణం చేపట్టింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు చైనా తాజాగా వార్నింగ్ ఇచ్చింది. 
 
ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ద్వైపాక్షిక బంధాలను దెబ్బతీసేంతగా డోక్లాం మారిపోయిందని, భారత్ దుందుడుకు వైఖరే ఇందుకు కారణమని, ఆ ప్రాంతం చైనాదేనని చెప్పేందుకు ఎటువంటి సందేహాలూ లేవని వాదించింది. 
 
ప్రస్తుతం ఇండియాలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి రష్యా - ఇండియా - చైనా విదేశాంగ శాఖ స్థాయి సమావేశంలో పాల్గొన్న వేళ, సుష్మా స్వరాజ్ తో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ సంవత్సరం జూన్ నుంచి దాదాపు 73 రోజుల పాటు డోక్లాం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం