Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రం ఒడ్డున నిలబడి ఫోజిచ్చింది.. భారీ అలలు వచ్చి లేపేశాయి..

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (15:38 IST)
మనలో చాలామంది సముద్ర ఒడ్డున నిలుచుని ఫోటోలు తీసుకుంటాం, అలలతో ఆట్లాడుకుంటాము. ఒక్కోసారి అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అదే అలలే మన పాలిట రాక్షస అలలుగా పరిణమిస్తాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఇండోనేషియాలోని నుసా లెంబోన్గాన్ అనే ఐలాండ్‌లో ఉన్న డెవిల్స్ టియర్ వద్ద చోటు చేసుకుంది. 
 
ఓ యువతి సముద్రం పక్కన ఉన్న కొండ మీదకి వెళ్లి ఫోటోకు ఫోజిచ్చింది. ఇంతలోనే వెనుకనుండి ఓ పెద్ద రాకాసి అల వచ్చి తనను ఢీకొట్టింది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా ఎగిరి పడిపోయింది. డెవిల్స్ టియర్ అనేది ఇండోనేషియాలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్. చాలా మంది టూరిస్ట్‌లు నిత్యం అక్కడకు వస్తుంటారు. అక్కడ ఫోటోలకు ఫోజులిస్తూ, ప్రకృతి అందాలను తమ కెమరాల్లో బంధిస్తుంటారు. 
 
భారీ అలలు వస్తున్నప్పుడు మాత్రం పర్యాటకులు కాస్తంత దూరంగా పరిగెడతారు. ఈ అమ్మాయి మాత్రం వెనుకనుండి వచ్చిన భారీ అలను గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అమ్మాయి కాస్త వెనుకకు చూసి ఉంటే ప్రమాదం తప్పేదని నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments