Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలహీనపడిన వాయుగుండం - ఏపీలో వర్షాలు తగ్గుముఖం

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (15:02 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేపీ బలహీనపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పడుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణిస్తూ సోమవారం బలహీనపడి, అల్పపీడనం స్థాయికి పడిపోతుందని తెలిపారు. 
 
అయితే, అల్పపీడనం బలహీనపడినప్పటికీ సోమ, మంగళవారాల్లో మాత్రం అక్కడక్కడ వర్షపు జుల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావం కారణంగా తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. 
 
పైగా, సముద్రంలో అలజడి పూర్తిగా తగ్గిపోలేదని అందువల్ల జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని వారు హెచ్చరించారు. అయితే, ఈ వాయుగుండం ప్రభావం ఏపీలో పెద్దగా కనిపించలేదని చెప్పొచ్చు. ఒక్క పాలకోడేరులో మాత్రం 14 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదు కాగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షపు జల్లులు పడ్డాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments