Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
, సోమవారం, 12 సెప్టెంబరు 2022 (07:45 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు, తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అయితే, వచ్చే 24 గంటల్లో ఈ వాయుగుండం బలహీనపడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. 
 
ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఉత్తరాంధ్రలో సోమవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి బలహీనపడుతుందని వెల్లడించింది. 
 
అటు, వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 12న నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, ఆ తర్వాత సెప్టెంబరు 13, 14, 15 తేదీల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క చార్జ్‌తో 125 కి.మీ. అత్యుత్తమ శ్రేణితో జింగ్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించిన కైనటిక్ గ్రీన్