Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమ వివాహం... పుట్టింటికెళ్లి తిరిగిరాని భార్య, అల్లుడికి మామ బ్లాక్ మెయిల్... ఏమైంది?

man
, సోమవారం, 23 మే 2022 (20:51 IST)
వారం రోజుల క్రితమే ఓ యువకుడు తన ప్రియురాలిని కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. ఐతే తన తల్లిదండ్రులను చూసి వస్తానంటూ నవ వధువు తన పుట్టింటికి వెళ్లింది. ఇక తిరిగి రాలేదు. దీనితో అతడు షాక్ తిన్నాడు. నీ భార్యను వెనక్కి పంపాలంటే తను అడిగినంత డబ్బు ఇచ్చుకోవాలంటూ పిల్లతండ్రి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీనితో అతడు తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 
మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లయిన కొద్ది రోజులకే తన భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదంటూ ఇండోర్‌లోని ద్వారకాపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. ఇండోర్‌లోని ఒక గార్మెంట్స్ షాపులో పనిచేసే యువకుడు ద్వారకాపురి రిలాక్స్ గార్డెన్ వెనుక అద్దెకు ఉండేవాడు. ఇండోర్‌లోని గంగా నగర్‌లో నివసిస్తున్న అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడింది.

 
వారి స్నేహం ప్రేమగా మారింది. ఆ యువకుడు అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా జరిగిన ఈ వివాహాన్ని యువతి తరపు కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనితో పెళ్లయ్యాక యువతి తన పేరెంట్స్ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పింది. అతడు సరేనని పంపడంతో అమ్మాయి తండ్రి తన కుమార్తెను వెనక్కి పంపాలంటే తను అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆ యువకుడు గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మచిలీపట్నంలో విషాదం-సరాదాగా సముద్ర తీరానికి వెళ్లి...?