Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ దెబ్బకు అట్టుడికిపోతున్న ఇరాన్ - 75 మంది మృతి

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (10:20 IST)
ఇరాన్ దేశాన్ని హిజాబ్ కుదిపేస్తోంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు కదంతొక్కారు. ఈ సంఖ్య పదుల నుంచి వందలు, వందల నుంచి వేలు, వేల నుంచి లక్షల్లోకి చేరుకుంది. ఫలితంగా హిజాబ్ దెబ్బకు ఇరాన్ అట్టుడికిపోతోంది. ఈ ఆందోశలనపై ఇరాన్ సైనికులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫలితంగా ఇప్పటివరకు 75 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 
 
హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో 22 యేళ్ల యువతిని ఇరాన్ పోలీసుల నైతిక విభాగం అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆమె తీవ్ర గాయాలతో మృతి. దేశంలోని 46 నగరాలు, పట్టణాలకు వ్యాపించిన నిరసనలు వ్యాపించాయి. 
 
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో నిన్న వేలాదిమంది ఆందోళనకారులు ‘డెత్ టు ద డిక్టేటర్’ అంటూ నినాదాలు చేశారు. మూడు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ పాలనకు చరమగీతం పలకాలని నినదించారు. 
 
అమిని మృతి తర్వాత దేశంలోని 46 నగరాలు, పట్టణాలు, గ్రామాలకు నిరసనలు పాకాయి. ఈ నెల 17న ప్రారంభమైన నిరసనల్లో ఇప్పటివరకు 41 మంది ఆందోళనకారులు, పోలీసులు చనిపోయినట్టు ఇరాన్ అధికారిక టీవీ ప్రకటించింది. అమిని మృతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో విదేశీ కుట్ర ఉందన్న వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments