Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్షలో ఒక్క పదం తప్పు రాశాడనీ విద్యార్థిని చావబాదిన టీచర్.. తర్వాత ఏం జరిగింది?

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (09:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పరీక్షలో తప్పు రాశాడనీ చావబాదాడు. ఈ దెబ్బలు తీవ్రంగా తగలడంతో ఆ విద్యార్థి స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ విద్యార్థి ఆస్పత్రిలో 18 రోజుల పాటు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన యూపీని ఔరైయా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అఛల్దా పోలీస్‌స్టేషను పరిధిలోని ఆదర్శ్‌ కళాశాలలో వైషోలి గ్రామానికి చెందిన నిఖిత్‌ కుమార్‌ (15) పదో తరగతి చదువుతున్నాడు. సెప్టెంబరు 7న సైన్స్‌ టీచర్‌ అశ్వనీసింగ్‌ ఓ పరీక్ష నిర్వహించారు.
 
ఆ పరీక్షలో ఒకే ఒక్క పదాన్ని నిఖిత్ తప్పుగా రాశాడు. దీంతో పట్టరాని కోపంతో విద్యార్థి జట్టు పట్టుకొని కర్రతో టీచర్ దారుణంగా చావబాదాడు. దీంతో నిఖిత్‌ స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన బాలుణ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 
 
మెరుగైన వైద్యం కోసం లక్నో వెళ్లినా ఉపయోగం లేకపోయింది. కళాశాల ప్రిన్సిపాల్‌ సూచన మేరకు  నిఖిత్‌ వైద్య ఖర్చు రూ.40 వేలు.. అశ్వనీసింగ్‌ భరించారు. చికిత్స పొందుతూ సోమవారం నిఖిత్‌ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments