Webdunia - Bharat's app for daily news and videos

Install App

కువైట్‌లోని భారతీయుల్లో వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. కారణమిదే...

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (09:38 IST)
మన దేశ పౌరులు అనేక మంది ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లివున్నారు. వీరంతా ఇపుడు కరోనా వైరస్ కారణంగా అక్కడ కష్టాలుపడుతున్నారు. కరోనా దెబ్బకు అంతర్జాతీయ సరిహద్దులు మూసివేశారు. అంతర్జాతీయ రాకపోకలు కూడా నిలిపివేశారు. అదేసమయంలో అరేబియా దేశాల్లో కరోనా వైరస్ కూడా శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆయా దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. 
 
ముఖ్యంగా, కువైట్‌లో కూడా అనేక మంది భారతీయులు ఈ వైరస్ సోకినట్టు సమాచారం. దీనికి కారణం.. వారు అత్యంత ఇరుకైన గదుల్లో నివసించడంతో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అహ్మద్ నాసర్ అలా సభా చెప్పుకొచ్చారు. ఇదేవిషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌కు ఫోన్ చేసి తెలిపారు. 
 
పైగా, పరిస్థితి విషమించకముందే వీలైనంత త్వరగా ప్రత్యేక విమానాలను అనుమతించాలని కోరారు. అదేసమయంలో కువైట్‌లోని భారతీయుల యోగక్షేమాలను మంత్రి జైశంకర్‌కు ఆయన వివరించారు. 
 
మహ్బులలో 540 మంది భారతీయులు నివసించే కార్మిక క్యాంపులో వ్యాధి సోకిన ఒకరిని క్వారంటైన్‌ చేసినట్టు చెప్పారు. ఆ తర్వాత మరికొందరిని పరీక్షించగా, వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడంతో వారందరినీ రెండు ప్రత్యేక ఆసుపత్రులకు తరలించారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments