యువకులూ తస్మాత్ జాగ్రత్త : కరోనా బాధితుల్లో వారే అధికం..

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (09:28 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటికే 18 రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించింది. ఈ వైరస్ బారినపడిన వారిలో అత్యధికంగా యువకులే ఉన్నారు. అయితే, దేశంలో ఇప్పటివరకు చనిపోయిన కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్రం తాజాగా వెల్లడించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
 
దేశవ్యాప్తంగా మూడువేలకు పైగా కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా, వారిలో 83 శాతం మంది 60 ఏళ్లలోపు వారే. అందులో 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారి సంఖ్యే ఎక్కువ. 60 ఏళ్లు అంతకుమించి వయసు కలిగిన వారు కేవలం 17 శాతం మందే ఈ వైరస్ బారినపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
 
మరోవైపు, విదేశాల నుంచి వచ్చిన యువకుల్లో ఎక్కువమందికి ఈ వైరస్ సోకింది. వీరంతా చదువు, ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లినవారే. వీరిలోనూ 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారి సంఖ్యే ఎక్కువ. వైరస్ బారినపడిన వారిలో ఈ వయసు వారే ఎక్కువని కేంద్రం ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మొత్తంగా చూస్తే బాధితుల్లో తక్కువగా ఉన్న వృద్ధుల సంఖ్య.. మరణాల్లో మాత్రం ఎక్కువగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం పండగ లాంటి సినిమా : శివాజీ

Tharun Bhascker: దర్శకుడిగా నేను వెనుకబడలేదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments