Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మృతులు లక్ష సంచుల్ని సిద్ధం చేసిన అమెరికా

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (18:13 IST)
కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలం అవుతోంది. కరోనా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్యలో పావు వంతు అమెరికన్లదే కావడం విషాదకరమైన విషయం. ఇప్పటికే 6000కు పైగా మృతిచెందారు. లక్ష నుంచి రెండున్నర లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలవుతారని అమెరికా వైద్య వర్గాలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఆ మృతదేహాలను తరలించేందుకు వీలుగా ముందస్తుగా లక్ష సంచులు కావాలని అమెరికా విపత్తు స్పందన సంస్థ 'ఫెమా' ఆ దేశ సైన్యానికి సూచించడం గమనార్హం. ఇప్పుడు ఈ వార్త ఆదేశ ప్రజలను వణికిపోయేలా చేస్తోంది.

అంతేగాకుండా.. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలన్నీ స్తంభించాయి. ముఖ్యంగా అమెరికా కంపెనీలు ముందు జాగ్రత్తతో నష్టాల బారి నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. నష్టాలను పూడ్చుకునేందుకు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం, హెచ్‌1బీ వీసా కల్గిన ఉద్యోగులనే ముందుగా తొలగిస్తామని ప్రకటించడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

హెచ్‌-1బీ వీసాతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు కరోనా వైరస్ శాపంగా మారింది. దీంతో కరోనా దెబ్బకు అమెరికాలోవున్న భారతీయులు ఆందోళన పడుతున్నారు. ఏటా హెచ్‌-1బీ పొందుతున్న వారిలో 67 నుంచి 72 శాతం భారతీయులే ఉన్నారు. ఫలితంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు గడ్డుకాలం ఏర్పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments