Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ కొరియా కరోనాకు చుక్కలు చూపించింది.. ఎలాగంటే?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (12:28 IST)
చైనాలో కరోనా తొలి కేసు నమోదు కాగానే తమ దేశ సరిహద్దులను మూసివేశామని దక్షిణ కొరియా ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. అందుకే మా దేశంలోకి ఈ వైరస్‌ ప్రవేశించలేకపోయింది అని ఆదేశ యాంటి-ఎపిడమిక్‌ విభాగం డైరెక్టర్‌ పాక్‌ మియాంగు సు తెలిపారు. దీనిపై ప్రపంచదేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 
 
ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ వైరస్‌ బారిన పడి విలవిలలాడుతుంటే ఉత్తరకొరియా మాత్రం కరోనా ఫ్రీ కంట్రీ అని పేర్కోనడం అనుమానాలకు తావిస్తోందని ప్రపంచ మేధావులు, నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా సరిహద్దులను మూసివేయడంతోనే కరోనాను నియంత్రించగలిగామని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.
 
ఇంకా కరోనాపై పోరాటం కోసం కొరియా పెద్ద సంఖ్యలో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించడంతోపాటు క్వారంటైన్‌లో ఉంచింది. కొరియాలో తొలి కరోనా కేసును జనవరిలో గుర్తించారు. కానీ ఆ కేసు బయటపడక ముందే వుహాన్‌లో కరోనా విజృంభిస్తున్న తీరును గమనించే కొరియా కంపెనీలు టెస్టు కిట్లను డెవలప్ చేయడం మొదలుపెట్టాయి. 
 
కొరియాలో కరోనా పేట్రేగే సమయానికి రోజుకు పది వేల మందికిపైగా పరీక్షలు చేసే స్థాయికి ఆ దేశం చేరుకుంది. టెస్టింగ్ సెంటర్లతోపాటు హాస్పిటళ్లలో ఫోన్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఓ ప్రదేశంలో కరోనా కేసులు నమోదైతే.. ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు మొబైల్ ఫోన్ ద్వారా సందేశాలు పంపి.. అటు వెళ్లకుండా అప్రమత్తం చేశారు. కనీసం 15 కొరియా సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments