Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంటిలేటర్‌లో మంటలు.. కరోనా పేషెంట్ల మృతి

Webdunia
మంగళవారం, 12 మే 2020 (15:16 IST)
ఓవర్ లోడ్ కారణంగా వెంటిలేటర్‌లో మంటలు ఏర్పడిన కారణంగా ఆస్పత్రిలో కరోనా రోగులు మరణించారు. రష్యాలో ఈ ఘోరం జరిగింది. ఓవర్‌లోడ్ వల్ల వెంటిలేటర్ లో మంటలు వచ్చాయని తెలిసింది. సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో కరోనా రోగుల కోసం నిర్వహిస్తున్న ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు ప్రమాదం జరిగిందని ధ్రువీకరించారు. మృతుల సంఖ్య మాత్రం వెల్లడించలేదు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అనధికారిక వార్తల ద్వారా తెలిసింది. 
 
150 మంది రోగులను మంటల నుంచి సురక్షితంగా తరలించారు. గత శనివారం మాస్కోలోని ఓ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం సంభించినప్పుడు అక్కడ కరోనాకు చికత్స పొందుతున్న రోగుల్లో ఒకరు మరణించారు. రష్యాలో కరోనా కేసులు సోమవారం నాటికి 2 లక్షల 21 వేలకు పెరిగాయి.
 
ఇక రష్యాలో కరోనా కొత్త కేసులు బాగా పెరుగుతున్నాయి. రష్యాలో సోమవారం 94 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 2009గా ఉంది. రష్యాలో మరణాలు తక్కువగానే నమోదవుతున్నాయి. ప్రస్తుతం రష్యాలో 1,86,615 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. వీరిలో 2,300 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments