Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కోరల్లో విషం.. ఆన్‌లైన్‌లో కొన్నాడు.. తొడపై కాటేసింది.. ఎక్కడ..?

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (19:24 IST)
పాముకు పాలు పోసి పెంచినంత మాత్రాన కాటు వేయక మానదు అని మన పెద్దలు అంటుంటారు. ఈ నానుడి నిజమేనని చైనాలో జరిగిన సంఘటన నిరూపిస్తోంది. పామును పెంపుడు జంతువుగా పెంచుకోవాలని అనుకున్నాడు ఓ వ్యక్తి. అనుకున్నదే తడవుగా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి మరీ ఓ సర్పాన్ని కొనుగోలు చేశాడు. దాన్ని ఇంట్లో పెట్టి పోషించాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అది తన యజమానిని కాటేసింది. చివరకు ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
 
ఈశాన్య చైనాలోని హీలాంగ్జియాగ్ ప్రావిన్స్‌కు చెందిన లియు అనే వ్యక్తి పామును పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆన్ లైన్ లో మీటరు పొడవుండే కోబ్రాను ఆర్డర్ చేశాడు. సాధారణంగా ఇలాంటి పెంపుడు పాములకు ముందుగానే కోరలు పీకి వినియోగదారులకు అందజేస్తారు. ఇదే విషయాన్ని అమ్మకదారుడు లియూకు కూడా చెప్పాడు. అనంతరం పామును లియూ అడ్రస్‌కు డెలివరీ చేశారు. అప్పటి నుంచి లియూ ఆ పామును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ, పెంచుకుంటున్నాడు.
 
అయితే ఓ రోజు లియూ మంచంపై నిద్రిస్తుండగా... ఆ పాము అతడిపై తొడపై కాటేసింది. వెంటనే చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తరలించారు. తక్షణమే అప్రమత్తం కావడం వల్ల లియూ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పాము కోరల్లో విషముందని అప్పటికి గానీ తెలియలేదు. కాస్త ఆలస్యమైతే, పాము కాటు వేసిన శరీర భాగాన్ని తొలగించాల్సి వచ్చేదని, దీంతో పాటు ప్రాణం కూడా పోయి ఉండేదని వైద్యులు తెలిపారు.
 
పాముకు విషం ఉండటం ఏంటని లియూ, సంబంధిత విక్రేతను సంప్రదించాడు. తప్పు తమదేనని, పొరపాటున విషమున్న పామును డెలివరీ చేశామని అమ్మకందారుడు ఒప్పుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం బాధితుడి వంతైంది. దీంతో పామును పెంపుడు జంతువుగా పెంచుకోకూడదని అతడు నిర్ణయం తీసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments