Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (17:40 IST)
కాశ్మీర్ లోయలోని పహల్గాం, బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులపై పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కీలకమైన సైనిక చర్యలకు ఉపక్రమించింది. చైనా నుంచి సేకరించిన శక్తివంతమైన ఎస్‌హెచ్-15 సెల్ఫ్ ప్రొపెల్డ్ అర్టిలరీ వ్యవస్థలను పాకిస్థాన్ సైన్యం భారత సరిహద్దు సమీప ప్రాంతాలకు తరలిస్తోంది. 
 
పాకిస్థాన్ బలగాలు భారీ చైనా ఆయుధాలను తరలిస్తున్నట్టు చూపుతున్న కొన్ని వీడియోల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాశ్మీర్ ఘటన తర్వాత రెండు రాత్రుల పాటు సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగాయి. ఆ తర్వాత ఈ ఆయుధాల మొహరింపు జరగడం గమనార్హం. ఈ పరిణాణం సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు అద్దంపడుతోంది. 
 
తాజా నివేదిక ప్రకారం.. చైనా నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెల్సిందే. ఇస్లామాబాద్‌‍కు బీజింగ్‌‍కు పెద్ద ఎత్తున సైనిక సహకారం అందిస్తోందనే వాస్తవాన్ని ఎస్‌హెచ్-15 ఫిరంగుల మొహరింపు మరోమారు స్పష్టం చేసింది. చైనా, పాకిస్థాన్ దేశాల మధ్య సైనిక సంబంధాలు మరింతగా బలపడుతున్నాయని ఈ పరిణామం సూచిస్తుంది. 
 
చైనా తయారీ ఎస్‌హెచ్-15 ఫిరంగులు అధునాతనమైనవి, వేగంగా కదిలించగల సామర్థ్యం కలిగినవిగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ తన సరిహద్దుల వద్ద చైనా ఆయుధాలను మొహరించడంతో భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికపుడు నిశితంగా గమనిస్తున్నట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments