Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ఆ బిల్డింగ్ వణికింది.. అంతే జనాలు పరుగులు తీశారు..

Webdunia
మంగళవారం, 18 మే 2021 (21:39 IST)
China
చైనాలోని అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యాల్లో ఒకటి మంగళవారం వణుకుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ సంఘటన షెంజెన్‌ నగరంలో జరిగింది.
 
చైనాలోని సామాజిక మాధ్యమ వేదిక 'వీబో'లో ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, షెంజెన్‌లోని ఫుటియాన్ జిల్లాలో ఎస్ఈజీ ప్లాజా హఠాత్తుగా వణికింది. దీనికి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
 
భూకంపాల పర్యవేక్షక స్టేషన్ల నుంచి సమాచారాన్ని తెప్పించుకుని విశ్లేషించినట్లు తెలిపారు. షెంజెన్ నగరంలో మంగళవారం భూకంపం సంభవించలేదని స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు.
 
షెంజెన్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఎస్ఈజీ ప్లాజా అకస్మాత్తుగా కదిలింది. ఇది 300 మీటర్లు (980 అడుగులు) ఎత్తయిన ఆకాశహర్మ్యం.
 
ఇది హఠాత్తుగా వణకడం ప్రారంభమవడంతో దీనిలోని ప్రజలను ఖాళీ చేయించారు. చుట్టుపక్కల సంచరిస్తున్న ప్రజలు భయాందోళనతో సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments