Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ఆ బిల్డింగ్ వణికింది.. అంతే జనాలు పరుగులు తీశారు..

Webdunia
మంగళవారం, 18 మే 2021 (21:39 IST)
China
చైనాలోని అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యాల్లో ఒకటి మంగళవారం వణుకుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ సంఘటన షెంజెన్‌ నగరంలో జరిగింది.
 
చైనాలోని సామాజిక మాధ్యమ వేదిక 'వీబో'లో ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, షెంజెన్‌లోని ఫుటియాన్ జిల్లాలో ఎస్ఈజీ ప్లాజా హఠాత్తుగా వణికింది. దీనికి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
 
భూకంపాల పర్యవేక్షక స్టేషన్ల నుంచి సమాచారాన్ని తెప్పించుకుని విశ్లేషించినట్లు తెలిపారు. షెంజెన్ నగరంలో మంగళవారం భూకంపం సంభవించలేదని స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు.
 
షెంజెన్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఎస్ఈజీ ప్లాజా అకస్మాత్తుగా కదిలింది. ఇది 300 మీటర్లు (980 అడుగులు) ఎత్తయిన ఆకాశహర్మ్యం.
 
ఇది హఠాత్తుగా వణకడం ప్రారంభమవడంతో దీనిలోని ప్రజలను ఖాళీ చేయించారు. చుట్టుపక్కల సంచరిస్తున్న ప్రజలు భయాందోళనతో సురక్షిత ప్రాంతానికి పరుగులు తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

పెద్ది సినిమా గేమ్ ఛేంజర్ కాబోతోంది.. రామ్ గోపాల్ వర్మ కితాబు

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments