Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెచ్చగొడుతున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌లో 11 ప్రాంతాల పేర్లు

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (14:40 IST)
డ్రాగన్ కంట్రీ చైనా నిత్యం భారత్‌పై బుసలు కొడుతుంది. గతంలో పలుమార్లు కవ్వింపులకు పాల్పడిన చైనా ఇపుడు మరోమారు తన వక్రబుద్ధిని చూపింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్న చైనా... ఇపుడు ఆ ప్రాంతాల పేర్లను మారుస్తుంది. తాజాగా 11 ప్రాంతాల పేర్లను మార్చింది. చైనీస్, టిబెటిన్, షిన్యన్ అక్షరాలతో వీటి పేర్లను విడుదల చేసింది. ఇది మూడో విడత చర్యలో భాగంగా ఈ ప్రాంతాలను ఎంచుకుంది. 
 
చైనా మంత్రివర్గం జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలను అనుసరించి చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా చైనీస్, టిబెటన్, షిన్యిన్ అక్షరాలతో ప్రామాణిక పేర్లను విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు భూభాగాలను, ఐదు పర్వత శిఖరాలను, రెండు నదులతో పాటు సబార్డినేట్ అడ్మినిస్ట్రేటివ్ జిల్లాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. 
 
2017లో తొలి విడతలో ఆరు ప్రాంతాలకు, 2021లో రెండో విడతలో 15 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టింది. ఇపుడు మూడో విడతగా 11 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టబోతున్నట్టు రాసుకొచ్చింది. పైగా, ఈ పేర్ల ప్రకటన చట్టబద్ధమైన చర్య అని, అది చైనా సార్వభౌమ హక్కు అని చైనా నిపుణులను ఉటంకిస్తూ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments