Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర సిరియాలో ఉగ్ర బీభత్సం.. కారును పేల్చేశారు.. 14మంది మృతి

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (13:18 IST)
Blast
ప్రపంచ దేశాలు కరోనాతో నానా తంటాలు పడుతుంటే.. ఉగ్రవాదులు మరోవైపు పెచ్చరిల్లిపోతున్నారు. ఉత్తర సిరియాలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో 14 మంది మృతిచెందారు. 80 మంది గాయపడ్డారు. అలెప్పొ ప్రావిన్సులో ఉన్న అల్ బాబ్ జిల్లా పట్టణంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడు పదార్థాలు ఉన్న ట్రక్కును ఉగ్రవాదులు పేల్చారు. ఈ దాడి వెనుక ఐపీజీ లేదా పీకేకే ఉగ్రవాద గ్రూపు ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. 
 
అల్ బాబ్ పట్టణంలో దాడి జరగడం వారంలోనే ఇది రెండవసారి. ఆదివారం చెక్ పాయింట్ వద్ద జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మృతిచెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ చెర నుంచి అల్ బాబ్ పట్టణాన్ని 2017లో సిరియా ఆర్మీ విముక్తి చేసింది. టర్కీ బోర్డర్ సమీపంలో ఉన్న ఈ పట్టణం నుంచి ఉగ్రవాదులను ఎరివేసేందుకు 2016లో ఏడు నెలల ఆపరేషన్ చేపట్టారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments