Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అలా జరుగుతుంటే.. నిమ్మకు నీరెత్తినట్లు వుంటే ఎలా?

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (11:18 IST)
Budha
పాకిస్థాన్ ఆగడాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలుమార్లు నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్.. తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఓవరాక్షన్ చేస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో దాదాపుగా 800 ఏళ్లనాటి బౌద్ధ కట్టడాలు, క్షేత్రాలు ఉన్నాయి. ఈ భౌద్ధ క్షేత్రాలను పాకిస్థాన్ నిర్లక్ష్యం చేసింది. కొంతమంది పాక్ ఉగ్రవాదులు ఈ క్షేత్రాలను ధ్వంసం చేస్తుండగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. 
 
చారిత్రాత్మకమైన భౌద్ద కట్టడాలపై ధ్వంసం చేయడంపై భారత్ ఫైర్ అవుతోంది. పీవోకేలో ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతుంటే పాక్ చూస్తూ కూర్చోవడం ఏమిటని భారత అధికారులు మండిపడుతున్నారు. పాక్ ఆర్మీ అధికారుల అండదండలతోనే ఉగ్రవాదులు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని భారత్ ఆరోపించింది.
 
ప్రాచీన, పురాతనమైన చిహ్నాలను ధ్వంసం చేయడం అనాగరికమైన చర్య అని భారత విదేశాంగ శాఖ ఆరోపిస్తోంది. వెంటనే కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తమ దేశానికీ చెందిన పురావస్తు శాఖాధికారులను అనుమతించాలని, వారిని పునరుద్దరించేలా చూడాలని పాకిస్థాన్‌ను భారత్ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments