Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్ ఆయుధగారాన్ని ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

పాకిస్థాన్ ఆయుధగారాన్ని ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!
, శనివారం, 11 ఏప్రియల్ 2020 (11:00 IST)
ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ భయంతో వణికిపోతోంది. కానీ మన దాయాది దేశమైన పాకిస్థాన్ మాత్రం తన వక్రబుద్ధిని వీడటం లేదు. భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాదమూకలను ఉసిగొల్పుతోంది. ఇటీవల జమ్మూ కాశ్మీరులోని కుప్వారా జిల్లాలో ఏ విధమైన కవ్వింపులూ లేకుండానే, కాల్పులు జరిపి, ఐదుగురు ప్రత్యేక దళ సైనికులను పొట్టనబెట్టుకున్న విషయం తెల్సిందే. 
 
దీనికి భారత్ ప్రతీకార చర్య తీసుకుంది. భారత సరిహద్దుల నుంచి బోఫోర్స్ గన్స్‌ను వినియోగించిన సైన్యం, పాక్‍కు చెందిన ఆయుధాగారాన్ని ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ వీడియోను సైన్యాధికారులు విడుదల చేశారు.
 
ఈ వీడియోలో పలుమార్లు పేలుడు చప్పుళ్లు వినిపిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి వున్న టెర్రర్ లాంచ్‌పాడ్స్, పన్‌పొజిషన్స్, ఆయుధాలను దాచివుంచిన కేంద్రాలపై దాడులు జరిపినట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. అనుకున్న లక్ష్యాన్ని భారత గన్స్ ఛేదించాయని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నారు. 
 
కాగా, గత ఆదివారం కుప్వారా జిల్లాలో స్పెషల్ ఫోర్స్ సోల్జర్స్‌పై దాడికి దిగిన ఉగ్రవాదులు, ఐదుగురిని చంపేసిన సంగతి తెలిసిందే. ఆపై జరిగిన ఎన్‌కౌంటరులో ఉగ్రవాదులందరినీ భారత సైన్యం హతమార్చింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న సైన్యం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన చేయనున్న ప్రధాని మోడీ