Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో కరోనా అప్‌డేట్స్ : 24 గంటల్లో 40 మరణాలు - 1035 కేసులు

భారత్‌లో కరోనా అప్‌డేట్స్ : 24 గంటల్లో 40 మరణాలు - 1035 కేసులు
, శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:40 IST)
మన దేశంలో కూడా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఒకవైపు, పకడ్బంధీగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నప్పటికీ... కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో గత 24 గంటల్లో 1035 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి 40 మంది చనిపోయారు. 
 
అలాగే, దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7447కు చేరింది. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1574కు చేరింది. ఢిల్లీలో 14 మంది, మధ్యప్రదేశ్‌లో 36, గుజరాత్‌లో 19 మంది మరణించారు. 
 
అదేవిధంగా, తమిళనాడులో 911, ఢిల్లీలో 903, రాజస్థాన్‌లో 561, తెలంగాణలో 487, మధ్యప్రదేశ్‌లో 451, ఉత్తరప్రదేశ్‌లో 433, ఏపీలో 381, గుజరాత్‌లో 378, కేరళలో 364, జమ్మూకశ్మీర్‌లో 207, కర్ణాటకలో 207, హర్యానాలో 176, పంజాబ్‌లో 151, బెంగాల్‌లో 116, బీహార్‌లో 60, ఒడిశాలో 50, ఉత్తరాఖండ్‌లో 35, అసోంలో 29, హిమాచల్‌ప్రదేశ్‌లో 28, చండీఘర్‌లో 19, ఛత్తీస్‌గఢ్‌లో 18, లడఖ్‌లో 15, జార్ఖండ్‌లో 14, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 11, గోవాలో 7, పుదుచ్చేరిలో 7, మణిపూర్‌లో 2, త్రిపురలో 2, అరుణాచల్‌ప్రదేశ్‌, దాద్రా నగర్‌ హవేలి, మిజోరాంలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం!