Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో జాతిపిత మహాత్మ గాంధీకి అవమానం.. విగ్రహాన్ని కూల్చేశారు..

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (11:12 IST)
నల్లజాతీయులకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఇంకా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి వ్యతిరేకంగా ఇటీవల వాషింగ్టన్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో మరోసారి జాతిపిత మహాత్మ గాంధీకి అవమానం జరిగింది. 
 
భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వాషింగ్టన్ డిసిలో జరిగిన ఈ ఘటనపై భారతీయులు మండిపడుతున్నారు. మహాత్ముడిని అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరసనకారుల్లో కొంత మంది వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాని ప్రవాస భారతీయులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న గాంధీ విగ్రహం ధ్వంసం కావడంపై అమెరికా రాయబారి కెన్ జస్టర్ భారత్‌కు క్షమాపణలు చెప్పారు. ఇలా జరగడం పట్ల చింతిస్తున్నామన్నారు. క్షమాపణలను స్వీకరించాలని భారత్‌ను ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments