Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ ప్రధాని రేసులో వెనుకబడి పుంజుకుంటున్న రిషి సునక్

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (11:36 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో భారత మూలాలు ఉన్న రిషి సునక్ రేసులో వెనుకబడి ఇపుడు మళ్లీ పుంజుకుంటున్నారు. అదేసమయంలో పార్టీ గేట్ స్కామ్‌లో విచారణ ప్రభుత్వ ప్రక్రియ కాదని తాను ప్రధాని అయితే, స్వతంత్ర సలహాదారుడిని నియమిస్తానని రిషి సునక్ తెలిపారు. మరోవైపు, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తాను పంపే సందేశాలకు, చేసే ఫోన్లకు స్పందించడం లేదని చెప్పారు. 
 
బ్రిటన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఇంగ్లండ్‌లోని చెల్టెన్‌హామ్‌లో తాజాగా టోరీ సభ్యులతో చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బోరిస్ జాన్సన్ ‘పార్టీ గేట్’ కుంభకోణంపై జరుగుతున్న పార్లమెంటరీ విచారణపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
ఇది పూర్తిగా పార్లమెంటరీ ప్రక్రియ అని, ప్రభుత్వ ప్రక్రియ కానే కాదని స్పష్టం చేశారు. కామన్స్ ప్రివిలెజెస్ కమిటీలోని ఎంపీలను తాను గౌరవిస్తానన్నారు. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారని రిషి చెప్పుకొచ్చారు.
 
వ్యక్తిగతంగా ఉన్నత ప్రమాణాలు పాటించే తాను ప్రధాని అయిన వెంటనే మంత్రివర్గ ప్రయోజనాల కోసం స్వతంత్ర సలహాదారుడిని నియమిస్తానన్నారు. విశ్వాసం, చిత్తశుద్ధి, మర్యాద వంటివి రాజకీయ ఆత్మకు సంబంధించిన అంశాలని పేర్కొన్నారు. కాగా, రిషి సునాక్‌కు పోటీగా లిజ్ ట్రస్ బరిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments