Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో బాంబు పేలుడు.. ఏడుగురు చిన్నారులు మృతి

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:43 IST)
పాకిస్థాన్‌లోని పెషావర్ నగరం భారీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది.  వాయువ్య పాకిస్తాన్ నగరమైన పెషావర్ శివార్లలోని ఇస్లామిక్ సెమినరీ సమీపంలో మంగళవారం జరిగిన పేలుడులో చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు. 

70 మందికి పైగా గాయపడ్డారు.  క్షతగాత్రులను లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు.  నగర శివారులో ఉన్న ఇస్లామిక్‌ సెమినరీని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు.

తరగతులు జరుగుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఓ బ్యాగుతో సెమినరీలోకి ప్రవేశించినట్లు పోలీసులు వెల్లడించారు. పేలుడులో దాదాపు ఐదు కిలోల ఐఈడీని ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు.

బాంబు దాడి జరిగిన పరిసర ప్రాంతాల్ని పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎవరూ ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్లుగా ప్రకటించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments