Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖుష్బూ అరెస్టు... ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:40 IST)
విడుతలై చిరుతైగల్‌ కచ్చి (విసికె) చీఫ్‌ థోల్‌ తిరుమవళవన్‌ మనుస్మృతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నిరసనకు దిగేందుకు యత్నించిన బిజెపి నేత, సినీ నటి ఖుష్బును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చెంగల్‌పట్టులో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. మనుస్మృతి మహిళలను కించపరిచేదిగా ఉందని, మనుధర్మం వారిని వేశ్యలుగా పరిగణిస్తోందని పేర్కొంటూ థోల్‌ ఇటీవల ఓ చోట ప్రసంగించారు. మనుస్మృతిని నిషేధించాలంటూ డిమాండ్‌ చేశారు. దీనిపై మండిపడ్డ బిజెపి శ్రేణులు..ఆయన క్షమాపణ చెప్పాలని కోరాయి.

ఈ వ్యాఖ్యలు మత ఘర్షణలకు తావునిచ్చేవిగా ఉన్నాయంటూ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు బిజెపి మహిళా విభాగం పిలుపునిచ్చింది. దీంతో ఆందోళనలు చేపట్టేందుకు వెళుతున్న ఖుష్బును పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

తనపై వస్తున్న విమర్శలకు థోల్‌ సైతం గట్టిగానే స్పందించారు. తాను మనుస్మృతిని మాత్రమే నిషేధించాలని చెప్పానని, ఘర్షణలను ప్రేరేపించేందుకు బిజెపి నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు.

బిజెపి శ్రేణుల ఫిర్యాదు మేరకు థోల్‌పై కేసు నమోదైంది. ఆయనపై కేసు నమోదు చేయడాన్ని డిఎంకెతో పాటు ఇతర ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments