Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా భారీ పేలుడు.. ఏడుగురు మృతి.. 70 మందికి గాయాలు

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (11:53 IST)
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. మోగ్‌బజార్ వైర్‌లెస్ గేట్ ఏరియా ప్రాంతంలో రాత్రి 8 గంటల సమయంలో ఘటన జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 70 మందికి గాయాలయ్యాయి.

క్షతగాత్రుల్లో 29 మందిని ఢాకా మెడికలల్ కాలేజికి, 10 మందిని నేషనల్ బర్న్ అండ్ ప్లాస్టిక్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. మిగతా వారిని ఇతర ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 
 
మృతుల సంఖ్య మరింతా పెరవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే గ్యాస్ లీకేజీ వల్లే పేలుడు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ అగ్నిమాపపశాఖ మాత్రం ఇంకా ధృవీకరించలేదు.
 
రాత్రి 10.30 గంటల సమయంలో ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ షపీఖుల్ ఇస్లామ్ ఘటనా స్థాలానికి వెళ్లి పరిశీలించారు. ఐతే బాంబు పేలుడు లేదా ఉగ్రదాడి జరిగినట్లుగా అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేవని ఆయన తెలిపారు. గ్యాస్ లీకేజీ లేదా సిలిండర్ పేలుడు వల్లే ఘటన జరిగి ఉండచ్చవని వెల్లడించారు. స్థానికులు మాత్రం ఎయిర్ కండిషనర్ పేలిపోయినట్లుగా చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments