Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశువును ప్లాస్టిక్ పేపర్లో చుట్టి కొరియర్ చేసింది: పార్శిల్ కదిలింది.. ఏడుపు శబ్ధం వినిపించడంతో?

ముక్కుపచ్చరాలని శిశువును ఓ ప్లాస్టిక్ పేపర్లో చుట్టి పార్సెల్ చేసి ఓ మహిళ కొరియర్ ద్వారా ఓ అనాధ ఆశ్రమానికి పంపించిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఏమాత్రం కనికరం లేకుండా శిశువు కొరియర్లో అనాధాశ్రామానికి పం

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (12:34 IST)
ముక్కుపచ్చరాలని శిశువును ఓ ప్లాస్టిక్ పేపర్లో చుట్టి పార్సెల్ చేసి ఓ మహిళ కొరియర్ ద్వారా ఓ అనాధ ఆశ్రమానికి పంపించిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఏమాత్రం కనికరం లేకుండా శిశువు కొరియర్లో అనాధాశ్రామానికి పంపడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని దాదా అనే ప్రాంతంలో ఓ కొరియర్ సంస్థకు ఓ పార్శిల్ వచ్చింది. అందులో ఓ అనాధ ఆశ్రమానికి సంబంధించిన చిరునామా వుంది. 
 
ఆ పార్శిల్‌ను ఇచ్చేందుకు కొరియర్ బాయ్ వెళ్తున్న సమయంలో ఆ పార్శిల్ నుంచి కదలికలు మొదలయ్యాయి. శిశువు ఏడ్చే శబ్ధం వినిపించింది. వెంటనే కొరియర్ బాయ్ ఆ పార్శిల్‌ను తెరచి చూశాడు. అందులో ముక్కుపచ్చలారని శిశువు వుండటం చూసి షాక్ అయ్యాడు. ఆపై స్థానికుల సహకారంతో పోలీసులకు కొరియర్ బాయ్ సమాచారం ఇచ్చాడు.
 
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శిశువును పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత ఆ శిశువు కన్నతల్లిని పోలీసులు కనుగొన్నారు. ఆమె పేరు లువోనని తెలిసింది. ఆమెను శిశువును వచ్చి తీసుకెళ్లాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా చైనాలో శిశువు వధించే వారికి ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments