Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో భారీ పేలుడు - 30 మంది మృతి

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (16:22 IST)
దాయాది దేశం పాకిస్థాన్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఓ మసీదు వద్ద ఇది జరిగింది. శుక్రవారం కావడంతో ప్రార్థనల కోసం మసీదుకు అనేకమంది వచ్చారు. ఆ సమయంలో ఈ పేలుడు సంభవించడంతో 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. 
 
వాయువ్య పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో కొచా రిసల్దార్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించడంతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. 
 
ఈ పేలుళ్ళపై పోలీస్ అధికారి మహ్మద్ సజ్జాద్ ఖాన్ మాట్లాడుతూ, పేలుడు సంభించిన మసీదు, పరిసర ప్రాంతాల్లో అనేక మార్కెట్లు ఉన్నాయని, సాధారణంగా శుక్రవారం ప్రార్థనల సమంయలో రద్దీగా ఉండటంతో ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు పేలుడు సమయంలో కాల్పులు కూడా వినిపించాయని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సెకండ్ సింగిల్ హే జింగిలి..రాబోతుంది

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments