Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో దారుణం.. హోటల్‌కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. 24 మంది సజీవ దహనం!!

వరుణ్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (17:54 IST)
రాజకీయ అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. ఆందోళనకారులు ఓ హోటల్‌కు నిప్పుపెట్టారు. దీంతో 24 మంది సజీవదహనమ్యయారు. మరికొందరు గాయపడ్డారు. దేశంలో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గత 21 రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. 
 
ఇవి తారాస్థాయికి చేరుకోవడంతో వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు వరకు 440 మంది చనిపోయారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశ సైన్యం రంగంలోకి దిగి తీవ్రంగా కృషి చేస్తుంది. పైగా, దేశ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె దేశాన్ని వీడిన కొన్ని గంటల్లోనే వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ నేపథ్యంలో జషోర్ జిల్లాలో ఓ హోటల్‌కు మంగళవారం ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 24 మంది సజీవదహనమయ్యారు. మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నారు. ఈ హోటల్ అవామీ లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి  షాహిన్ చక్లాదర్‌కు చెందిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్‌ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments