Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయనాడు విలయంలో వానరం.. బిడ్డను హత్తుకుని కాపాడిన వైనం (Video)

సెల్వి
మంగళవారం, 6 ఆగస్టు 2024 (17:41 IST)
monkey
కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌లో ముండుక్కై, చూరల్మలలో జులై 30వ తేదీన ప్రకృతి సృష్టించిన విపత్తు అంత ఇంత కాదు. ఈ విపత్తు కారణంగా వందలాది మంది మరణించారు. ఎంతో మంది గాయపడ్డారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 
 
ఈ విపత్తును ముందే ఓ రామ చిలుక పసిగట్టిందని..రామ చిలుక చేసిన హంగామాతో ఆ ఇంటి యజమానులు ఇళ్లు ఖాళీ చేసి మరో ప్రాంతంలో ఉంటున్న తన సోదరి నంద నివాసానికి వెళ్లిపోయారట.  అలాగే ఇరుగు పొరుగు వారు సైతం తమ తమ ఇళ్లును వదిలి తెలిసిన వారి ఇళ్లకు చేరుకున్నారన్నారు. దీంతో వారంతా ప్రాణాలతో భయటపడ్డారట. 
 
ఇలా ప్రకృతి విలయాన్ని పక్షులు ముందుగానే పసిగడతాయని పరిశోధనలు ఇప్పటికే తేల్చాయి. అలాగే మనిషిలా జంతువులు కూడా తమ పిల్లలను కాపాడేందుకు ముందుంటాయి. ఈ క్రమంలో వయనాడు విలయంలో చిక్కుకున్న తన బిడ్డను ఓ వానరం హక్కున చేర్చుకుని కాపాడింది. ఎవరైనా కాపాడుతారా అన్నట్లు ఆ వానరం అటూ ఇటూ చూస్తూ.. నిలబడేందుకు శక్తి లేకపోయినా తన బిడ్డను గట్టిగా పట్టుకుని కనిపించింది.
 
శరీరం అంతా బురద.. ఆ బురదతో కంటిని తెరవలేని స్థితిలో బిడ్డను కాపాడుతూ కనిపించింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేరళ రాష్ట్రం వయనాడులో జరిగిన విధ్వంసం తరువాత ఒక కోతి పిల్ల తనకన్నా చిన్న పిల్లను కాపాడుతున్న విధానం చూసైనా మనం మన సాటి మనిషికి ఆపదలో సహాయం చేయాలని తెలుసుకోవాలని రాసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments