Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత ప్రభుత్వంలా మేం తప్పులు చేయలేం : ఆర్-5 జోన్‌ లబ్దిదారులకు శుభవార్త!!

వరుణ్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (16:59 IST)
గత ప్రభుత్వంలా అడ్డుగోలు తప్పులు తాము చేయలేమని, అందువల్ల ఆర్-5 జోన్ లబ్దిదారులకు వారి సొంత స్థలాల్లోనే ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు కేటాయించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇతర ప్రాంతాల పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించలేమని, వారివారి సొంత స్థలాల్లోనే స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. సోమవారం అమరావతిలో జిల్లాల కలెక్టర్ల సమావేశం జరిగింది. ఇందులో సీఎం చంద్రబాబు ఆర్-5 జోన్‌పై ప్రత్యేకంగా చర్చించారు. ఆర్-5 జోన్ లబ్దిదారులకు వాళ్ల వాళ్ల ప్రాంతాల్లోనే ఇళ్లు కేటాయించాలని సీఎం  చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 
 
ఆర్-5 జోన్ లబ్దిదారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వారి కోసం భూసేకరణ చేపట్టాలని, అవసరమైతే టిడ్కో గృహాల తరహాలో ఇల్లు కట్టించి ఇవ్వాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పేదలను తీసుకొచ్చి అమరావతిలో ఆర్-5 జోన్‌ ఏర్పాటు చేసి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం తెలిసిందే. ఆ విధంగా తీసుకొచ్చిన పేదలకు వారి సొంత ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామే తప్పా.. వారికి అమరావతిలో స్థలాలు కేటాయించలేమని చంద్రబాబు స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments