Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత ప్రభుత్వంలా మేం తప్పులు చేయలేం : ఆర్-5 జోన్‌ లబ్దిదారులకు శుభవార్త!!

వరుణ్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (16:59 IST)
గత ప్రభుత్వంలా అడ్డుగోలు తప్పులు తాము చేయలేమని, అందువల్ల ఆర్-5 జోన్ లబ్దిదారులకు వారి సొంత స్థలాల్లోనే ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు కేటాయించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇతర ప్రాంతాల పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించలేమని, వారివారి సొంత స్థలాల్లోనే స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. సోమవారం అమరావతిలో జిల్లాల కలెక్టర్ల సమావేశం జరిగింది. ఇందులో సీఎం చంద్రబాబు ఆర్-5 జోన్‌పై ప్రత్యేకంగా చర్చించారు. ఆర్-5 జోన్ లబ్దిదారులకు వాళ్ల వాళ్ల ప్రాంతాల్లోనే ఇళ్లు కేటాయించాలని సీఎం  చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 
 
ఆర్-5 జోన్ లబ్దిదారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వారి కోసం భూసేకరణ చేపట్టాలని, అవసరమైతే టిడ్కో గృహాల తరహాలో ఇల్లు కట్టించి ఇవ్వాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పేదలను తీసుకొచ్చి అమరావతిలో ఆర్-5 జోన్‌ ఏర్పాటు చేసి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం తెలిసిందే. ఆ విధంగా తీసుకొచ్చిన పేదలకు వారి సొంత ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామే తప్పా.. వారికి అమరావతిలో స్థలాలు కేటాయించలేమని చంద్రబాబు స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments