Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత ప్రభుత్వంలా మేం తప్పులు చేయలేం : ఆర్-5 జోన్‌ లబ్దిదారులకు శుభవార్త!!

వరుణ్
మంగళవారం, 6 ఆగస్టు 2024 (16:59 IST)
గత ప్రభుత్వంలా అడ్డుగోలు తప్పులు తాము చేయలేమని, అందువల్ల ఆర్-5 జోన్ లబ్దిదారులకు వారి సొంత స్థలాల్లోనే ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు కేటాయించాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇతర ప్రాంతాల పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించలేమని, వారివారి సొంత స్థలాల్లోనే స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. సోమవారం అమరావతిలో జిల్లాల కలెక్టర్ల సమావేశం జరిగింది. ఇందులో సీఎం చంద్రబాబు ఆర్-5 జోన్‌పై ప్రత్యేకంగా చర్చించారు. ఆర్-5 జోన్ లబ్దిదారులకు వాళ్ల వాళ్ల ప్రాంతాల్లోనే ఇళ్లు కేటాయించాలని సీఎం  చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 
 
ఆర్-5 జోన్ లబ్దిదారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వారి కోసం భూసేకరణ చేపట్టాలని, అవసరమైతే టిడ్కో గృహాల తరహాలో ఇల్లు కట్టించి ఇవ్వాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పేదలను తీసుకొచ్చి అమరావతిలో ఆర్-5 జోన్‌ ఏర్పాటు చేసి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం తెలిసిందే. ఆ విధంగా తీసుకొచ్చిన పేదలకు వారి సొంత ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామే తప్పా.. వారికి అమరావతిలో స్థలాలు కేటాయించలేమని చంద్రబాబు స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments