పాకిస్థాన్‌లో భారీ పేలుడు - 10 మంది మృత్యువాత

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (16:53 IST)
దాయాది దేశమైన పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ ఓడ రేవుపట్టణంగా గుర్తింపు పొందిన కరాచీ నగరంలో నిత్యం రద్దీగా ఉండే షేర్షా పరాచా చౌక్‌లోని ఓ భవనంలో ఈ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుళ్ళలో 10 మంది వరకు చనిపోయినట్టు ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. 
 
ఈ భారీ పేలుడు ధాటికి సమీపంలోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా 
సాగుతున్నాయి. 
 
పేలుడు జరిగిన ప్రాంతంలో ఓ బ్యాంకు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన పోలీసులు... గ్యాస్ లీక్ కావడం వల్లే ఈ పేలుడు సంభవినట్టు తెలుస్తుందని తెలిపారు. అయితే, పేలుడు భారీ స్థాయిలో ఉండటంతో ఏదేని ఉగ్ర సంస్థకు చెందిన వారు ఈ పనికి పాల్పడివుంటారని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments