Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో విషాదం : గ్యాస్ సిలిండర్ పేలి పూరిగుడిసెలు దగ్దం

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (16:28 IST)
కృష్ణా జిల్లాలోని తోటవల్లూరు మండలం, గరికపర్రు అనే గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో అనేక పూరి గుడిసెలు కాలిపోయాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. 
 
స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల మేరకు... ఈ గ్రామానికి చెందిన మేకల వీరమ్మ అనే మహిళకు చెందిన పూరిగుడిసెలో గ్యాస్ పొయ్యిపై పాలుబెట్టి బయట పనులు చేసుకుంటుంది. ఆ సమయంలో గ్యాస్ లీకై మంటలు గుడిసెకు అంటున్నాయి. దీంతో ఆమె భయపడి తన బిడ్డను తీసుకుని బయటకు పరుగెత్తింది. 
 
ఇంతలోనే గ్యాస్ బండ పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఆ గుడిసెకు పక్కనే ఉన్న అనేక గుడిసెలకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ గుడిసెల్లో ఉన్న వారంతా ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ మంటలను ఆర్పేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింద. 
 
ఫలితంగా అనే గుడిసెలు కాలిపోయాయి. నాలుగు కుటుంబాలకు చెందిన ప్రజలు కేవలం కట్టుబట్టలతో మిగిలారు. ఈ అగ్నిప్రమాదం వల్ల రూ.5 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించివుడొచ్చని అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments