Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో విషాదం : గ్యాస్ సిలిండర్ పేలి పూరిగుడిసెలు దగ్దం

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (16:28 IST)
కృష్ణా జిల్లాలోని తోటవల్లూరు మండలం, గరికపర్రు అనే గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో అనేక పూరి గుడిసెలు కాలిపోయాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. 
 
స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల మేరకు... ఈ గ్రామానికి చెందిన మేకల వీరమ్మ అనే మహిళకు చెందిన పూరిగుడిసెలో గ్యాస్ పొయ్యిపై పాలుబెట్టి బయట పనులు చేసుకుంటుంది. ఆ సమయంలో గ్యాస్ లీకై మంటలు గుడిసెకు అంటున్నాయి. దీంతో ఆమె భయపడి తన బిడ్డను తీసుకుని బయటకు పరుగెత్తింది. 
 
ఇంతలోనే గ్యాస్ బండ పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఆ గుడిసెకు పక్కనే ఉన్న అనేక గుడిసెలకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ గుడిసెల్లో ఉన్న వారంతా ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ మంటలను ఆర్పేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింద. 
 
ఫలితంగా అనే గుడిసెలు కాలిపోయాయి. నాలుగు కుటుంబాలకు చెందిన ప్రజలు కేవలం కట్టుబట్టలతో మిగిలారు. ఈ అగ్నిప్రమాదం వల్ల రూ.5 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించివుడొచ్చని అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments