Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మాజీ ప్రధాని కుమార్తె అరెస్ట్

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (06:19 IST)
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పీఎంఎల్ఎన్ పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్‌ ను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చౌద్రీ సుగర్ మిల్స్ కేసులో పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అధికారులు గురువారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
లోహోర్‌లోని కోట్ లక్‌పత్ జైల్లో ఉన్న తన తండ్రిని కలుసుకునేందుకు మరియం నవాజ్ వెళ్తుండగా అధికారులు అరెస్ట్ చేసినట్టు పాక్ మీడియా తెలిపింది. అయితే గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తనంత తానే ఎన్ఏబీ కార్యాలయానికి వెళ్లాలని భావించినప్పటికీ ఈలోగానే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇకపోతే అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో మరియం నవాజ్, ఆమె భర్త, తండ్రి నవాజ్ షరీఫ్ లు జైల్లో గడిపారు. కొద్దినెలల క్రితం ఈ ముగ్గురు జైలు నుంచి విడుదల అయ్యారు. విడుదలైన కొద్దిరోజుల్లోనే అల్ అజీజియా స్టీల్ మిల్స్ కేసులో నవాజ్ షరీఫ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన లాహోర్ జైల్లో ఉన్నారు. తాజాగా మరియం నవాజ్ ను ఎన్ఏబీ అధికారులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments