Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్ నుంచి చమురు దిగుమతులొద్దు.. వంద శాతం సుంకాలా?: ట్రంప్

ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపి వేయాలని అమెరికా కోరింది. వచ్చే నవంబర్ నుంచి భారత్‌తో పాటు అన్నీ దేశాలు చమురు దిగుమతులను ఆపేయాలని కోరింది. భారత్‌కు, భారత కంపెనీలకు మినహాయింపు ఏమీ ఉండబోదని అగ్

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (17:27 IST)
ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపి వేయాలని అమెరికా కోరింది. వచ్చే నవంబర్ నుంచి భారత్‌తో పాటు అన్నీ దేశాలు చమురు దిగుమతులను ఆపేయాలని కోరింది. భారత్‌కు, భారత కంపెనీలకు మినహాయింపు ఏమీ ఉండబోదని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ట్రంప్ ఆ దేశంపై తిరిగి ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
అమెరికా ఇరాన్‌పై  విధించే ఆర్థిక ఆంక్షలు ఇతర దేశాల మాదిరే చైనా, భారత కంపెనీలకు కూడా అమలవుతాయని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి చెప్పారు. ఇప్పటి నుంచే చమురు దిగుమతులను తగ్గించుకుంటూ నవంబర్ 4 నాటికి పూర్తిగా ఆపేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
 
మరోవైపు అమెరికాలో తయారై భారత్‌కు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 100 శాతం పన్నులను విధించడాన్ని డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. వచ్చే వారంలో భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ.. వివిధ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. 
 
భారత్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. అమెరికా ఉత్పత్తులపై వంద శాతం పన్ను వసూలు చేస్తున్నారని.. ఈ పన్నులను తొలగించాలని తాము కోరుతున్నామని ట్రంప్ తెలిపారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై ట్రంప్ పన్నుల భారాన్ని పెంచడం మొదలు పెట్టిన తరువాత, పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై సుంకాలను విధిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments